కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటు అడిగే హక్కు లేదు: డీకే అరుణ

కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటు అడిగే హక్కు లేదు: డీకే అరుణ

గద్వాల, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటు అడిగి హక్కు లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డ్  కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలను డబ్బు సంపాదనకు మార్గంగా మార్చేస్తున్నారని, ఎమ్మెల్యేగా గెలిచి అక్రమంగా డబ్బు సంపాదించి ఓట్లు కొనేందుకు ప్లాన్  చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా 5 వేల డబుల్  బెడ్రూమ్  ఇండ్లు ఇస్తానని సీఎం కేసీఆర్  చెప్పారని, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

 గతంలో పేదలకు పంచిన ఇంటి జాగాలను గుంజుకొని మోసం చేశారన్నారు. ఎన్నికల సందర్భంగా అనేక హామీలిచ్చి అన్నివర్గాలను మోసం చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడతానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, త్యాగరాజు, రజక జయశ్రీ, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.