మోత్కుపల్లిని కలిసిన కుంభం

మోత్కుపల్లిని కలిసిన కుంభం
  • గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి 

యాదాద్రి, వెలుగు :  భువనగిరి నుంచి పోటీ చేస్తున్న తన గెలుపునకు సహకరించాలని కాంగ్రెస్​ అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును కోరారు. హైదరాబాద్​లోని మోత్కుపల్లి నివాసానికి వెళ్లిన కుంభం భువనగిరిలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు.

బీఆర్ఎస్​ గ్రాఫ్​ పడిపోతుందని, కాంగ్రెస్‌‌‌‌ గాలి వీస్తోందని చెప్పారు.  ఇంకొంత కష్టపడితే భారీ మెజార్టీ వస్తుందని,  తన తరఫున ఎన్నికల  ప్రచారంలో పాల్గొనాలని కోరారు. అందుకు మోత్కుపల్లి సమ్మతించారు. కాంగ్రెస్ గెలుపు కోసం తప్పకుండా పనిచేస్తానని మాటిచ్చారు.