కామారెడ్డి, వెలుగు : మహిళల ఆర్థిక ఉన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం దోమకొండలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నాసిరకం చీరలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యత గల చీరలు పంపిణీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఓట్ చోర్ సంతకాల సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఎన్నికల టైంలో ఓట్చోరీకి పాల్పడుతుందని విమర్శించారు. జిల్లా కేంద్రంలో దూప దీప నైవేధ్య చెక్లను షబ్బీర్అలీ పంపిణీ చేశారు.
లింగంపేటలో..
లింగంపేట : లింగంపేటలో సోమవారం ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. అమ్మలు, అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం తరఫున సారె పెడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.10 కోట్లతో పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేస్తున్నామని స్థల సేకరణ పూర్తయ్యిందని చెప్పారు. మోతె శివారులో రూ.2 వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైనట్లు తెలిపారు. ఎంపీడీవో నరేశ్,తహసీల్దార్ సురేశ్, ఐకేపీ ఏపీఎం వినోద్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, గౌరవాధ్యక్షుడు దశరథ్ నాయక్, సంతోశ్రెడ్డి, జొన్నల రాజు, ఎల్లమయ్య పాల్గోన్నారు.
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో..
నస్రుల్లాబాద్ : నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రోస్చైర్మన్ బాల్ రాజ్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలకు చీరలు అందించాలని నిర్ణయించిందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం మహిళలకు భోజనాలు ఏర్పాటు చేశారు.
చీరల పంపిణీ పారదర్శకంగా జరగాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ఎడపల్లి : ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలో చీరల పంపిణీని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, ఐకేపీ ఏపీఎం గంగారాం, సిబ్బంది ఉన్నారు.
