
వరి కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ ఐదు అంచెల కార్యక్రమాలు చేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారిపోయాయన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణతో పోరాడతామన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. రెండు నెలల ప్రోగ్రాంతో ప్రభుత్వంపై మంట పుట్టిస్తామన్నారు నేతలు.