
తాడ్వాయి, వెలుగు: పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ నాయకుల ఆసత్య ఆరోపణలు సరికాదని కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు ఇప్ప నాగేశ్వరరావు అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్లో మంత్రిపై బీఆర్ఎస్మాజీ జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి చేసిన ఆరోపణలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నార్లపూర్ కి మంత్రి సీతక్క 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించారన్నారు.
మరో పది మందికి ఇండ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ, బీఆర్ఎస్ నాయకులు మంత్రిపై కక్షతో ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రాపోలు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ ఎనగంటి రామయ్య, మాజీ వైస్ ఎంపీపీ బుర్రి అరుణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.