
ఆదిలాబాద్టౌన్, వెలుగు : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి శివారులో నిర్మించనున్న రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నాగన్న శనివారం హైదరాబాద్లో మంత్రిని కలిశారు. రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.