కోల్ బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపల్చైర్పర్సన్ఎన్నిక సందర్భంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై బాల్క సుమన్ తన అనుచరులతో రాళ్లదాడి చేసిన ఘటనలో గాయపడ్డ బాధితులు కోలుకోవాలని కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. శనివారం మందమర్రిలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో యూత్ కాంగ్రెస్ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాళ్లదాడిలో కానిస్టేబుల్ రాకేశ్, కాంగ్రెస్ కార్యకర్తలు జావిద్, తోకల సురేశ్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. ఇలాంటి హింసాత్మక సంఘటనలు పునరావృత్తంకాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. మందమర్రి మండల యూత్ కాంగ్రెస్వైస్ ప్రెసిడెంట్ మాయ తిరుపతి, మాజీ జనరల్ సెక్రటరీ వడ్లూరి సునీల్ కుమార్, నాయకులు ఆర్.కిరణ్, ఎం.శేఖర్, జి.నరేశ్, సురేందర్, చోటు, గణేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
