ప్రజా తీర్పును గౌరవిస్తాం.. కాంగ్రెస్ ఏ పార్టీతో కలవదు: ఎమ్మెల్యే బొజ్జు

ప్రజా తీర్పును గౌరవిస్తాం.. కాంగ్రెస్ ఏ పార్టీతో కలవదు: ఎమ్మెల్యే బొజ్జు
  •     మున్సిపల్ వైస్ చైర్​పర్సన్​గా సాజిదా బేగం పేరు ప్రకటన

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్​లో మీడియా సమావేశంలో  మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు తమ పార్టీ సభ్యులు, తాను హాజరైనప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చైర్​పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఏకమై ప్రజలకు మోసం చేయడానికి చూస్తున్నాయన్నారు. 

తమ పార్టీ నుంచి మున్సిపల్ వైస్ చైర్​పర్సన్​గా సాజిదా బేగం పేరును ప్రకటించారు. సీల్డ్ కవర్​లో చైర్​పర్సన్ పేరును ఎన్నికల అధికారికి అందజేస్తామని తెలిపారు. కౌన్సిలర్లు రాజురా సత్యం, నిమ్మల రమేశ్, గొర్రె తిరుమల, సాజిదాబేగం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయానంద్, మున్సిపల్ మాజీ చైర్​పర్సన్ అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.