![కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా..నల్గొండ సభ పెట్టడం సిగ్గుచేటు : మదన్మోహన్ ఫైర్](https://static.v6velugu.com/uploads/2024/02/41_eSKgtN5C39.jpg)
హైదరాబాద్, వెలుగు : గత పదేండ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ఎమ్మెల్యే మదన్మోహన్ విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టడానికి నల్గొండలో సభ నిర్వహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే రామచంద్రనాయక్, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మాట్లాడారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అంటూ వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని, తుగ్లక్పనిచేసిన కేసీఆర్.. అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చుక్కనీరు కూడా రాలేదని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కేటీఆర్, హరీశ్రావుకు ఇంకా మత్తు దిగడం లేదన్నారు. కేసీఆర్ నిజమైన తెలంగాణ వాది కాదు కాబట్టే అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నా ప్రతిపక్షనేతగా సభకు హాజరు కావడం లేదని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం కృష్ణాజలాలను కేసీఆర్ఆంధ్రాకు తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్విమర్శించారు. నిజాయితీ ఉంటే కేసీఆర్అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు.