కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌ను కనుగొనాలి: శశి థరూర్

కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌ను కనుగొనాలి: శశి థరూర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు పర్మినెంట్ ప్రెసిడెంట్‌గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త నాయకత్వాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు. సోనియా గాంధీ నిరవధికంగా కాంగ్రెస్ చీఫ్‌గా ఉంటూ పార్టీ బాధ్యతలను మోస్తారనుకోవడం అన్యాయం అవుతుందన్నారు. పార్టీకి చుక్కానిగా ఉంటూ అపసవ్య భావనను తొలగించడానికి ఫుల్ టైమ్ ప్రెసిడెంట్‌ను కనుగొనే ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేయాలని థరూర్ సూచించారు.

‘కాంగ్రెస్‌ పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయత్వంపై మేం మరింత స్పష్టంగా ఉండాలని నేను నమ్ముతున్నా. గతేడాది తాత్కాలిక ప్రెసిడెంట్‌గా సోనియా జీ నియామకానికి నేను కూడా మద్దతుగా నిలిచా. కానీ పార్టీ బాధ్యతలను ఆమె నిరవధికంగా మోయాలనుకోవడం న్యాయం కాదు. కాంగ్రెస్‌ను మరోమారు నడిపించే సామర్థ్యం రాహుల్‌కు ఉంది. కానీ ఆ పదవిని చేపట్టడానికి ఆయన నిరాకరిస్తే కొత్త చీఫ్‌గా మరొకరిని ఎన్నుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉండాలి’ అని థరూర్ చెప్పారు. పార్టీ చీఫ్‌గా కొనసాగడానికి సోనియా సిద్ధంగా లేరని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ బాధ్యతలను మోయడానికి రాహుల్ కూడా ఆసక్తి చూపడం లేదని సమాచారం.