కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆఫీసులో పార్టీ జెండా అవిష్కరించారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, టౌన్ ప్రెసిదెంట్ పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గొనే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జైతాపూర్లో..
ఎడ పల్లి, వెలుగు: ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు నాగుల రాజు గౌడ్ ఎన్నిక కావడంతో గ్రామ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఉప సర్పంచ్ భార్గవ్, పార్టీ ఉపాధ్యక్షుడు గొడితే నవీన్, మాజీ సర్పంచ్ దోమటి పరశురాం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఆదివారం డీసీసీ ఆఫీస్లో నాయకులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్ కాటిపల్లి నాగేశ్ రెడ్డి పార్టీ జెండా ఎగురేసి ప్రసంగించారు. త్యాగాల చరిత్రపై కాంగ్రెస్ పునాది నిర్మితమైందన్నారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్ తాహెర్, టీపీసీసీ జనరల్సెక్రెటరీ రాంభూపాల్, లైబ్రరీ కమిటీ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర పార్టీ ప్రెసిడెంట్ బొబ్బిలి రామకృష్ణ, రత్నాకర్ ఉన్నారు.
నందిపేట, వెలుగు: నందిపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్, మదారొద్దీన్, భూమేశ్, లోక హన్మండ్లు, నసీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఆదివారం లింగంపేట మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లను పంపిణీ చేశారు.
