
న్యూఢిల్లీ: పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టినట్లు సభల్లో ప్రధాని మోదీ చెప్తున్నారని.. అదే అంశంపై చర్చించేందుకు పార్లమెంట్సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సినిమా డైలాగులు చెప్తే సరిపోదని, వెంటనే పార్లమెంట్లో చర్చ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. పీటీఐతో కూడా మాట్లాడారు. రాజస్తాన్లోని బికనీర్ సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. భారత్, పాకిస్తాన్ మధ్య సీజ్ఫైర్కు తాము మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలపై మోదీని నిలదీశారు.
పహల్గాం దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, వారిని ఎప్పుడు పట్టుకుంటారని జైరాం ప్రశ్నించారు. ఇప్పటికైనా పార్లమెంట్ప్రత్యేక సమావేశాలు పెట్టి.. దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ఎంపీ ప్రణితి షిండే మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్సిందూర్తర్వాత ప్రధాని మోదీ దృష్టంతా పబ్లిసిటీ, సొంత భజనపై ఉంది. దేశ ప్రజలకు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడం లేదు. పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి కారణమైన టెర్రరిస్టులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు” అని ప్రశ్నించారు.