సోనియా గాంధీకి కరోనా

సోనియా గాంధీకి కరోనా

మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తగ్గుముఖం పడుతుందని అనుకుంటుండగా.. ఒక్కసారిగా కేసులు అధికమౌతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. మరోసారి పంజా విసురుతుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల సైతం ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. 2022, మే 02వ తేదీ గురువారం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్ లోకి వెళ్లారు. మరోవైపు... ఈనెల 08వ తేదీన ఆమె ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉంది.

కానీ.. కరోనా వైరస్ బారిన పడడంతో ఆమె హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. సోనియా గాంధీ ఇటీవలే పలు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు పలువురు నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడడంతో నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నేతలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తల కోసం : -
 

రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల విషెస్

కాలుష్యం గుప్పిట్లో యమునా నది