కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు అహ్మద్ పటేల్(71) కన్నుమూశారు.కరోనాతో నెల రోజులుగా చికిత్స పొందుతున్న అహ్మద్ పటేల్ ఇవాళ ఉదయం ఆస్పత్రిలో మృతి చెందారు.  శరీరంలోని చాలా అవయవాలు పనిచేయని కారణంగా చనిపోయారని ఆయన కొడుకు ఫైసల్ పటేల్ ట్విట్టర్లో తెలిపారు. అహ్మద్ పటేల్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడిగా పనిచేశారు. లోక్ సభకు మూడు సార్లు, రాజ్యసభకు ఐదు సార్లు ఎన్నికయ్యారు అహ్మద్ పటేల్.

కరోనా వ్యాక్సిన్ టూరిజం ప్యాకేజ్..భారతీయులకు ఆఫర్