
తుక్కుగూడ, వెలుగు: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభతో ఔటర్ రింగ్రోడ్డుపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. విజయబేరి సభ ప్రారంభమయ్యే సమయానికి ఒక్క సారిగా వాహనాలన్నీ శ్రీశైలం హైవేపైకి వచ్చాయి. దాంతో ఓఆర్ఆర్ పై పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నంబర్-15 నుంచి బొంగులూర్ ఎగ్జిట్ నంబర్-12 వరకు దాదాపు రెండు గంటలు ఎక్కడివక్కడ వెహికల్స్ నిలిచిపోయాయి.
Also Rard: ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు షాక్: కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి
దాంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో బస్సులు, డీసీఎంలు, కార్లలో విజయభేరికి బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలంతా ట్రాఫిక్ కారణంగా మీటింగ్ కు హాజరు కాకుండానే వెనుదిరిగారు. మీటింగ్ ముగిసే సమయానికి ట్రాఫిక్ జాం పూర్తిగా తగ్గింది.