అనుమానంతో మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్

అనుమానంతో మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్

నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం జరిగింది. ఓ మహిళ గొంతు కోసి పరారయ్యాడు కానిస్టేబుల్ సురేష్. లక్ష్మీ నగర్‌లో నివాసం ఉంటున్న షేక్ ఉన్ని అనే మహిళపై వెంకటగిరి బెటాలియన్‌లో పనిచేస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ సురేష్ శనివారం ఉదయం మహిళపై బ్లేడ్‌తో దాడి చేశాడు. ఆమె మెడ రెండు చేతులు మణికట్లు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. సురేష్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఆమెను నెల్లూరు ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు. నెల క్రితం సురేష్ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భార్య ఆత్మహత్యకు  ఆ మహిళే కారణమనే అనుమానంతో గొంతు కోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.