తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు

తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఫస్ట్ టైం రికార్డ్ స్థాయిలో కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,432 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 33 మంది ప్రాణాలు కోల్పోయారు.మొత్తం రాష్ట్రంలో మరణాలు 1,961కి చేరాయి. నిన్న మరో 2,152 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 58,148 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా నిన్న జీహెచ్ఎంసీలో 1,464 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 606, రంగారెడ్డిలో 504, నిజామాబాద్ లో 486, ఖమ్మంలో 325, వరంగల్ అర్బన్ 323,మహబూబ్ నగర్ లో 280, కామారెడ్డి 247 లో కేసులు నమోదయ్యాయి.