కేరళలో ఒక్కరోజే 46,387 కేసులు

కేరళలో ఒక్కరోజే 46,387 కేసులు

కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి కేసుల నమోదు ప్రారంభమైన తరవాత ఎన్నడూ లేనివిధంగా నిన్న ఒకే రోజు అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. కేరళ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 46,387 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిన్న రాష్ట్రంలో 34,199 కేసులు నమోదు కాగా.. 24 గంటల్లో మరో 12వేలపైబడి కేసులు ఎక్కువయ్యాయి. మరోవైపు 15,388 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ఇదే సమయంలో 32 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 51,501కు చేరింది. తాజాగా 62 ఒమైక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో వీటి సంఖ్య 707కు చేరింది.