కరోనా కారణంగా సిటీలకు సిటీలనే లాక్ డౌన్ చేయడం, ఫ్యాక్టరీలను మూసేయడంతో చైనా, సౌత్ కొరియా, ఇటలీల్లో పొల్యూషన్ ఒక్కసారిగా తగ్గిపోయింది. కాలుష్యానికి మారుపేరుగా ఉండే చైనాలోని బీజింగ్, చెంగ్డూ ప్రాంతాల్లోనూ గాలి కాస్త శుభ్రంగా మారింది. అమెరికాకు చెందిన సెంటినల్–5పి శాటిలైట్ తీసిన చిత్రాలను అక్కడి డెస్కర్ట్స్ ల్యాబ్స్ విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించింది.
ఫ్యాక్టరీలు, వెహికిల్స్ నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి వంటివి ఆగిపోవడమే కారణమని పేర్కొంది. ఈ ప్రాంతాల ఏడాది కిందటి, ప్రస్తుత మ్యాప్ లను విడుదల చేసింది. కాలుష్యం పెరగడమే తప్ప.. ఇలా తగ్గడాన్ని జీవితంలో చూస్తామనుకోలేదని ఇటలీ బకోని వర్సిటీ నిపుణుడు మార్కో కామెంట్ చేశారు.