వరంగల్ లో మంత్రుల పర్యటనలో కరోనా కలకలం

వరంగల్ లో మంత్రుల పర్యటనలో కరోనా కలకలం

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ జ్యోతి దంపతులకు కరోనా పాజిటివ్ గా తేలింది. సోమవారం వరంగల్ జిల్లాలో పంట నష్టం పరిశీలనకు వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో పర్యటించారు గండ్ర దంపతులు. మంత్రులతో కలిసి నర్సంపేట నుంచి హెలీకాప్టర్ లో హైదరాబాద్ కు వెళ్లారు ఎమ్మెల్యే దంపతులు. జర్వం వస్తుందని పరీక్షలు చేయించుకోగా... గండ్ర వెంకటరమణా రెడ్డి, జ్యోతి దంపతులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో... నిన్నటి పంటనష్టం పర్యటనకు వచ్చిన మంత్రులు సహా ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.

డిన్నర్లో ఇవి తినొద్దు

రిపబ్లిక్ డే వేడుకలకు పిల్లలకు నో ఎంట్రీ