ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ కు కరోనా పాజిటివ్

ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా నియంత్రణకు పోరాడుతున్న భారత వైద్య  పరిశోధన మండలి (ICMR)  అధికారి కరోనా బారిన పడ్డారు. ICMR  డీజీ ప్రొఫెసర్ బలరాం భార్గవకు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో బలరాం  భార్గవకు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.