రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు పొడగింపు

రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు పొడగింపు

హైదరాబాద్: కొవిడ్‌ ఆంక్షల అమలును తెలంగాణ సర్కారు పొడిగించింది. ఈ నెల 31 వరకు వరకు సభలు, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. సామూహిక కార్యక్రమాలపై ఈ నెలాఖరు వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌ కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున తాజాగా ఆంక్షలను పొడగించింది. ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది.

ఇవి కూడా చదవండి..

కరోనా టెస్టు రేట్లను తగ్గించిన మరో రాష్ట్రం

అభివృద్ధికే ప్రజలు పట్టం కడతరు