హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఐదో ఎడిషన్కు రంగం సిద్ధమైంది. హైటెక్ సిటీ గేమ్ పాయింట్లోని అత్యాధునిక బ్యాడ్మింటన్ సెంటర్లో శనివారం ఈ టోర్నీ మొదలవనుంది. రెండ్రోజుల పాటు జరిగే మెగా టోర్నీలో ఈ సారి ఎనిమిది కార్పొరేట్ సంస్థల నుంచి 150 మందికి పైగా షట్లర్లు పోటీ పడుతున్నారని గేమ్ పాయింట్ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు.
మొత్తం ఏడు వ్యక్తిగత ఈవెంట్లతో పాటు ప్రత్యేకమైన టీమ్ ఈవెంట్లో పోటీలు జరుగతాయని వెల్లడించారు. టీమ్ ఈవెంట్లో జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్మన్ శాక్స్, ఇన్ఫోసిస్, నోవార్టిస్, కోల్రూయిట్ గ్రూప్, ఫిన్ఎంకేటీ, సామ్రాట్ గ్రూప్ జట్టుతో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆప్టమ్ బరిలో నిలిచింది.