ఆదిలాబాద్ మార్కెట్​కు పోటెత్తిన పత్తి

ఆదిలాబాద్ మార్కెట్​కు పోటెత్తిన పత్తి

ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్​కు పత్తి పోటెత్తింది. సంక్రాంతి పండుగ తర్వాత సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తుందని ప్రచారం జరగడంతో రైతులు పత్తి లోడ్లతో మార్కెట్​కు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున వెహికల్స్​తరలి రావడంతో మార్కెట్ చుట్టూ భారీగా ట్రాఫిక్​జామ్​ఏర్పడింది.

రెండు గంటల పాటు పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 2 వేల బండ్లు మార్కెట్ కు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా లారీ డ్రైవర్ల బంద్​తో ఇప్పటికే పత్తి నిల్వలు పేరుకుపోగా, కొత్తగా వచ్చిన పత్తితో మార్కెట్​నిండిపోయింది. కొనుగోళ్లు నిలిచిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్​శంకర్, అడిషనల్​కలెక్టర్​శ్యామలాదేవి మార్కెట్​కు చేరుకుని పరిశీలించారు. లారీల ఓనర్లతో మాట్లాడి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.     
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్