కల్వకుర్తిలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారనే అభియోగాలతో కొందరు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులపై ఎల్బీ నగర్ పీఎస్ లో ఐపీసీ 341,143,290 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై శనివారం మెట్ పల్లి పోలీసు స్టేషన్ లో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. మీర్ పేట్, కామారెడ్డి, మహబూబ్ నగర్ లలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.