చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై తడబడింది. చెన్నై బౌలర్ల దాటికి ముంబై బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒపెనర్ కామరాన్ గ్రీన్ 6 పరుగులకే ఔటయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్ 7, రోహిత్ శర్మ డకౌట్ ఇలా 14 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.
వరుస వికెట్లు పడుతున్న ముంబైని నేహల్ వాధేరా సూర్య కుమార్ యాదవ్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వాధేరా 64, సూర్యకుమార్ యాదవ్, 26, ట్రిస్టాన్ స్టబ్స్ 20 పరుగులు మినహా మిగతా ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. చెన్నై బౌలర్లలో మతీసా పతిరానా 3, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే లు చెరో రెండు, రవీంధ్రా జడేజా ఒక వికెట్ తీశారు.