సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ 2024కు పోటెత్తిన దరఖాస్తులు

సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ 2024కు పోటెత్తిన దరఖాస్తులు

దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు CUET-PG -2024 ప్రవేశ పరీక్షకు ఈసారి రికార్డుస్థాయిలో దరఖాస్తులు అందాయి. మొత్తం 4.62 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,47,990 మహిళలు, 2,14,587 పురుష అభ్యర్థులు ఉన్నారు.  కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో  పీజీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10తో ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారు.  షెడ్యూలు ప్రకారం  మార్చి 11 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా 324 కేంద్రాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

 మొత్తం 157 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరుగనుంది. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో  ఇవ్వొంచ్చు.  ఈ ప్రవేశ పరీక్షతో దేశంలోని 179  యూనివర్సిటీలలో దాదాపు 344 పీజీ కోర్సులతోపాటు 271 రీసెర్చ్ ప్రోగ్రాంలలో ప్రవేశం పొందొచ్చు.  దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలు కల్పిస్తారు.  ఈ ప్రవేశ పరీక్షతో దేశంలోని 179  యూనివర్సిటీలలో దాదాపు 344 పీజీ కోర్సులతోపాటు 271 రీసెర్చ్ ప్రోగ్రాంలలో ప్రవేశం పొందొచ్చు.  దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలు కల్పిస్తారు.


సీయూఈటీ పీజీ పరీక్షను రోజుకు మూడు సెషన్ల చెప్పున  ఉదయం 9 గంటల నుంచి 10.45 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.15 గంటల వరకు మూడోసెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరుకోవాల్సి ఉంటుంది. 
అభ్యర్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలి. పరీక్ష ఆరంభానికి అరగంట ముందుగానే అభ్యర్థులు హాల్‌టికెట్ల వెరిఫికేషన్, పరీక్ష హాల్, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, వ్యక్తిగత హాజరు తదితర ప్రక్రియను పూర్తిచేస్తారు. 


తెలంగాణలో కేంద్రాలు
 హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్

ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష కేంద్రాలు
 అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం