బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాలలో రహదారిపై ప్రమాదకరంగా కల్వర్టులు

బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాలలో రహదారిపై ప్రమాదకరంగా కల్వర్టులు

జన్నారం, వెలుగు : గతేడాది కురిసిన భారీ వర్షాలకు జన్నారం మండల కేంద్రం నుంచి బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాలకు వెళ్లే రహదారిపై ఉన్న రెండు కల్వర్టుల వద్ద బుంగలు పడ్డాయి. కానీ సంబందిత ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవటం లేదు. రెండు కల్వర్టుల రిపేర్లకు నెల రోజుల క్రితం ప్రభుత్వం రూ.1.54 కోట్లు మంజూరు చేసింది.

 కానీ  టెండర్లు పూర్తికాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ఈ రోడ్డుపై ప్రతిరోజు ఆటోలు, స్కూల్ బస్సులు, బైక్​లు ఇతర వాహనాలు వెళ్తుంటాయి. ప్రజలు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. కల్వర్టులపై ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఆఫీసర్లు స్పందించి రిపేర్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.