ఇండియాతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌తో కమిన్స్​ రీ ఎంట్రీ

ఇండియాతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌తో కమిన్స్​ రీ ఎంట్రీ

సిడ్నీ: గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ప్యాట్‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌.. ఇండియాతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ముందు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆడి ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావాలని ఆశిస్తున్నాడు. యాషెస్‌‌‌‌‌‌‌‌ ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో గాయపడిన కమిన్స్‌‌‌‌‌‌‌‌కు డాక్టర్లు ఆరు వారాల విశ్రాంతి సూచించారు. దీంతో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 7 నుంచి 17 వరకు సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌కు అతను అందుబాటులో ఉండటం లేదు. ఆ తర్వాత 22, 24, 27న ఇండియాతో జరిగే మూడు వన్డేల్లో ఆడాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో కమిన్స్‌‌‌‌‌‌‌‌ స్థానంలో  మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌  కెప్టెన్​గా వహించనున్నాడు.