
మొహర్రం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దార్-ఉల్-షిఫా, డబీర్ పురాలోని బీబీ కా ఆలంను శుక్రవారం ఆయన విజిట్చేసి, దట్టీలు సమర్పించారు. తర్వాత బందోబస్తు , భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మొహర్రం సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు విజిట్చేసే అవకాశం ఉన్నందున 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీపీతో పాటు సౌత్జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, ట్రాఫిక్డీ సీపీ వెంకటేశ్వర్లు ఉన్నారు.