3 కోట్లు గెలుచుకున్నారని చెప్పి 27 లక్షలు కొట్టేసిన్రు

3 కోట్లు గెలుచుకున్నారని చెప్పి 27 లక్షలు కొట్టేసిన్రు

నారాయణ్ ఖేడ్, వెలుగు: మీ మొబైల్ ​నంబర్ రూ.2 కోట్ల 90 లక్షలు గెలుచుకుందని నమ్మించి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలానికి చెందిన వ్యక్తి నుంచి సైబర్​నేరగాళ్లు రూ.27లక్షలు కొట్టేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. నారాయణఖేడ్​మండలానికి చెందిన వ్యక్తి ఫోన్​కు మీ జియో నంబర్ రూ.2కోట్ల 90లక్షలు గెలుచుకుందని మెసేజ్​వచ్చింది. నిజమేనని నమ్మిన సదరు వ్యక్తి తన డీటెయిల్స్ అన్నీ పంపించాడు. తర్వాత అతనికి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్​చేసి మీరు గెలుచుకున్న మొత్తం క్లైం చేసుకోవాలంటే రూ.17లక్షలు ట్యాక్స్​కట్టాలని చెప్పడంతో వివిధ అకౌంట్లలో 17లక్షలు వేశాడు. గుర్తుతెలియని మరోసారి ఫోన్​చేసి మీ ఇంటికి ఓ ఏటీఎం కార్డు పంపిస్తున్నాం దాని ద్వారా ప్రైజ్​మనీ డ్రా చేసుకోమని చెప్పాడు. కార్డు ద్వారా రూ.5వేలు డ్రా చేసిన బాధితుడు తర్వాత డబ్బు రాకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్​చేసి విషయం చెప్పాడు. ప్రైజ్​మనీ మొత్తం రావాలంటే మరో రూ.10 లక్షలు తమ అకౌంట్లలో వేయాలని గుర్తుతెలియని వ్యక్తి చెప్పగా బాధితుడు మరోసారి రూ.10లక్షలు వేశాడు. తర్వాత ఫోన్​చేయగా మరికొంత అమౌంట్ వేయాలని కోరడంతో తాను సైబర్​నేరగాళ్ల ట్రాప్​లో పడిపోయానని బాధితుడు తెలుసుకున్నాడు. శుక్రవారం నారాయణ్​ఖేడ్​పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్ చేశాడు. ఎస్సై వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.