షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీతేజ్, ఆక్సాఖాన్, రూపిక ప్రధాన పాత్రల్లో కాచిడి గోపాల్రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘దళారి’. ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మాత. శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ నిర్వహించారు. షకలక శంకర్ మాట్లాడుతూ ‘దీన్ని రెండు భాగాలుగా తీశాం.
మంచి కథతో పాటు యాక్షన్ ఉన్న సినిమా ఇది. రెండో భాగాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’ అన్నాడు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘శంకర్ కష్ట జీవి, చాలా బాగా నటించాడు. సినిమా బాగా వచ్చింది. చాలా కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది’ అన్నారు. ‘ప్రస్తుత సమాజంలోని సమస్యల నేపథ్యంలో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాం’ అని మేకర్స్ తెలియజేశారు.