సిద్దిపేట జిల్లాలో మా భూమి మాకివ్వాలని ధర్నా

సిద్దిపేట జిల్లాలో మా భూమి మాకివ్వాలని ధర్నా

చేర్యాల, వెలుగు : మా భూమి మాకివ్వాలని డిమాండ్​ చేస్తూ దళితులు జీపీ ఎదుట ధర్నా చేసిన ఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూమిని సర్పంచ్​ఆక్రమించి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారని, తమకు మరోచోట భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలైనా ఇవ్వడంలేదని ఆరోపించారు.  

ఎన్నిసార్లు సర్పంచ్​, జీపీ కార్యదర్శి, ఎంపీపీని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ భూమి తమకు ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో దళితులంతా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిని ఆశ్రయించగా..కాంగ్రెస్​ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.