
హైదరాబాద్, వెలుగు: దాల్మియా సిమెంట్ తన ప్రొడక్టులను సమర్థంగా వాడేలా బిల్డర్లకు, కస్టమర్లకు అవగాహన కలిగించడానికి ‘రూఫ్ కాలమ్ ఫౌండేషన్ (ఆర్సీఎఫ్) తో స్ట్రాంగ్ఘర్’ పేరుతో హైదరాబాద్లో సోమవారం రోడ్షో నిర్వహించింది.
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ రీబ్రాండింగ్ కోసం దేశంలోని 75 నగరాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము 14–-15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.