
భారత్ తో జరుగుతోన్న సెకండ్ టెస్టులో వెస్టిండీస్ ధీటుగా ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో సెకండ్ టెస్టు రిజల్ట్ ఆసక్తికరంగా మారింది.
శనివారం మూడో రోజు 86/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన వెస్టిండీస్ .. వర్షం కారణంగా 67 ఓవర్లు వేయడంతో 143 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాత్ వైట్ 75 పరుగులతో డిఫెన్స్ తో నిలబడ్డాడు. తర్వాత అశ్విన్ వేసిన బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో చంద్రపాల్ 33, మాక్ జై 32, బ్లాక్ వుడ్ 20 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో అథనేజ్ 37, జోసన్ హోల్డర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.. నాల్గో రోజు వెస్టిండీస్ బ్యాటర్లు నిలిస్తే టెస్టు డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.