గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కంటెయినర్లు ఢీ కొనడంతో 11 మంది చనిపోయారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వడోదరలోని వాఘోడియా క్రాసింగ్ హైవే వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్ సూరత్ నుంచి పావ్ ఘడ్ కు వెళ్తుండగా..వడోదరలోని వాఘోడియా క్రాసింగ్ వద్ద ఇంకో కంటైనర్ ను ఢీ కొట్టింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Death toll rises to 11 in the incident in Vadodara: Ranjan Ayyer, Superintendent, SSG Hospital, Vadodara
Two trucks collided with each other at Waghodia Crossing Highway in Vadodara earlier this morning. https://t.co/DfjccVSVmN
— ANI (@ANI) November 18, 2020