విమాన ప్రమాదం: 20కి చేరిన చనిపోయిన వారి సంఖ్య

విమాన ప్రమాదం: 20కి చేరిన చనిపోయిన వారి సంఖ్య
  • మరికొంత మంది పరిస్థితి విషమం

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరినట్లు విమానయాన శాఖ అధికారులు చెప్పారు. 171 మంది వేర్వేరు హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని అన్నారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 18 మందిని గుర్తించామని, మరో ఇద్దర్ని గుర్తించాల్సి ఉందని అధికారులు చెప్పారు. కరోనా ప్రొటోకాల్‌ ప్రకారం శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రమాదం విచారణ చేసేందుకు ఏవియేషన్‌ మినిస్ట్రీ రెండు బృందాలను నియమించింది. ఆ బృందంలో ఒకటి ఇప్పటికే కోజికోడ్‌కు చేరుకుని విచారణ ప్రారంభించింది. దుబాయ్‌ నుంచి కోజికోడ్‌ ఎయిర్‌‌పోర్ట్‌కు వస్తున్న ఎయిర్‌‌ ఇండియా విమానం రన్‌వే పై నుంచి స్కిడ్‌ అయ్యింది. 35 అడుగుఅల లోయలో పడి రెండు ముక్కలైంది. శుక్రవారం రాత్రి 7: 40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.