ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కేసుల తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 19,241 శాంపిల్స్ పరీక్షించగా.. 335 మందికి పాజిటివ్ గా నిర్ధారయ్యింది.ఎక్కువగా  పశ్చిమ గోదావరి జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి.అదే సమయంలో 936 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు చనిపోయారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,94,818 మంది కోలుకున్నారు.ఇంకా 6,754 మందికి చికిత్స జరుగుతోంది.కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,713కి పెరిగింది.

మరిన్ని వార్తల కోసం..

తుఫానులో ఎయిరిండియా ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్