డీప్​ఫేక్ ​భయానక ట్రెండ్​:మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్యనాదెళ్ల

డీప్​ఫేక్ ​భయానక ట్రెండ్​:మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్యనాదెళ్ల

 

  • ఇలాంటి సందర్భాల్లో తక్షణ చర్యలు అవసరం

  • మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల


వాషింగ్టన్‌: ప్రముఖ పాప్‌ సింగర్ టేలర్‌ స్విఫ్ట్‌ అసభ్యకర డీప్‌ఫేక్‌ ఫొటోలు  ప్రస్తుతం అగ్రరాజ్యంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ట్రెండ్‌పై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఈ ట్రెండ్ దారుణం,​ భయానకమైనది. ఇలాంటి సందర్భాల్లో వేగంగా స్పందించడం అవసరం. ఆమోదయోగ్యమైన కంటెంట్​మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా రక్షణ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. డీప్‌ఫేక్‌ల కట్టడికి దర్యాప్తు సంస్థలు, టెక్‌ సంస్థలు కలిసివస్తే.. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వాటిని అరికట్టవచ్చు’ అని నాదెళ్ల తెలిపారు.