సినీ తారలపై నిత్యం ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ సుందరి దీపికా పదుకునేపై ఓ వార్త హల్చల్ చేస్తోంది. తమిళ హీరో శింబు 48వ సినిమాను కమల్ హాసన్ తన బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికాను అనుకున్నారట.
అయితే, ఇందులో చేయడానికి ఆమె పెట్టిన కండీషన్స్ చూసి ఈ హీరో కంగుతిన్నాడట. రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు సకల సౌకర్యాలతో హోటల్ బుక్ చేయాలని డిమాండ్ చేసిందట. అందులో తనకు తన సిబ్బంది కోసం ఫ్లోర్ మొత్తం బుక్ చేయాలని అదనంగా ఖర్చులన్నీ భరించాలని తెలిపిందట. ఇదంతా విని ఈ రేంజ్ హీరోయిన్తో మేం సినిమా చేయలేమనే డెసిషన్కి వచ్చేశారట. దీంతో ఈ ప్రాజెక్ట్లో దీపికాను తీసుకునే ఆలోచన పక్కన పెట్టేశారనే టాక్ నడుస్తోంది.