రష్యాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

రష్యాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ( బుధవారం) రష్యాకు బయలుదేరారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన వెళ్లారు.  ఇందులో భాగంగా మాస్కోలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. రష్యా, చైనా రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్‌ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లడఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గవచ్చని సమాచారం. భారతీయ వాయుసేనకు చెందిన విమానంలో రాజ్‌నాథ్‌ సింగ్ రష్యాకు పయనమయ్యారు.