ఈ ఏడాదే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు

ఈ ఏడాదే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు

జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికలపై రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివర్లో జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. జమ్ముకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఇటీవలే ముగిసిందన్నారు. జమ్ములో 43 అసెంబ్లీ స్థానాలు, కశ్మీర్​లో 47 అసెంబ్లీ స్థానాలు ఉంటాయని తెలిపారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.