
ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా తో పాటు విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
బంగ్లాదేశ్ సంక్షోభంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తోంది కేంద్ర ప్రభుత్వం. బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, దేశ సరిహద్దుల్లో భద్రత వంటి అంశాలను నేతలకు వివరిస్తున్నారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల ఆందళనలు హింసాత్మకంగా మారడంతో.. ఆగస్ట్ 5న ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఇండియాకు వచ్చారు. ఇక్కడి నుంచి యూకే బయల్దేరనున్నారు షేక్ హసీనా.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సైనికాధిపతి జమాన్. ప్రభుత్వం మారిన ఇప్పటికీ బంగ్లాలో అల్లర్లు కొనసాగుతున్నాయి. చిట్టగాంగ్ లోని నాలుగు పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు ఆందోళన కారులు. మరో వైపు బంగ్లాలో అల్లర్ల నేపథ్యంలో సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం.
#WATCH | Delhi: All-party meeting underway in the Parliament on the issue of Bangladesh. EAM Dr S Jaishankar briefs the members of different political parties. pic.twitter.com/4Cl1rFRkyG
— ANI (@ANI) August 6, 2024