ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ మే 4న ప్రారంభం

ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ మే 4న ప్రారంభం
  • ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్
  • 27న పార్టీ జనరల్​బాడీ మీటింగ్‌‌లో అధికారిక ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని వసంత్ ​విహార్‌‌‌‌లో నిర్మించిన బీఆర్ఎస్​కేంద్ర కార్యాలయాన్ని మే నాలుగో తేదీన ప్రారంభించనున్నారు. భవనం పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ఈ మేరకు కేసీఆర్ ముహూర్తం నిర్ణయించారు. ఈనెల 27న తెలంగాణ భవన్‌‌లో నిర్వహించనున్న పార్టీ జనరల్​బాడీ మీటింగ్​లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. పార్టీ ఆఫీస్​ ప్రారంభోత్సవం సందర్భంగా రాజశ్యామలయాగం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.

మంత్రి ప్రశాంత్​ రెడ్డి కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి.. పార్టీ ఆఫీస్‌‌కు తుది మెరుగులపై పలు సూచనలు చేసి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌‌గా మార్చిన తర్వాత సర్దార్​పటేల్​రోడ్డులోని అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ఆఫీస్‌‌ను నిరుడు డిసెంబర్​14న కేసీఆర్​ప్రారంభించారు. పార్టీ జాతీయ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు తాత్కాలికంగా ఈ ఆఫీస్​ ఏర్పాటు చేశారు.