ఉల్లి ధర పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (ఆగస్టు 21వ తేదీ) నుంచి రాయితీపై కిలో ఉల్లిని రూ.25కే సరఫరా చేస్తుంది నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF)) . కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే టమాటాలను విక్రయిస్తోన్న ఎన్సీసీఎఫ్.. బఫర్ నిల్వల నుంచి ఉల్లిని కూడా రాయితీపై ప్రజలకు విక్రయిస్తుంది. బఫర్ స్టాక్ను పెంచుకోవడానికి అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొబైల్ వ్యాన్లు, రెండు రిటైల్ దుకాణాల ద్వారా కిలో ఉల్లిని రూ.25ల చొప్పున అందిస్తాస్తున్నామని ఎన్సీసీఎఫ్ ఎండీ అనిస్ జోసెఫ్ చంద్ర చెప్పారు . ఇప్పటికే 10 వ్యాన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మొబైల్ వ్యాన్లు నగరంలోని పలు ప్రాంతాలకు పంపబడతాయని తెలిపారు. రిటైల్ అవుట్లెట్లు ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని చెప్పారు.
ఉల్లిని ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ ఉల్లిని అందించడం ద్వారా ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో లభ్యత మెరుగుపడుతుందన్నారు.