ఎయిర్‌పోర్టులో కరెంట్ పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్

ఎయిర్‌పోర్టులో కరెంట్ పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ రోజు ఉదయం స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్యాసింజర్ టెర్మినల్ నుంచి టేకాఫ్ కోసం రన్ వే పైకి విమానం వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో విమానం రెక్కతో పాటు కరెంట్ పోల్ కూడా డ్యామేజ్ అయింది. ఢిల్లీ నుంచి జమ్ము వెళ్లాల్సిన ఆ ఫ్లైట్ ను స్పైస్ జెట్ సంస్థ రద్దు చేసింది. దాని స్థానంలో మరో విమానం వేసి ప్రయాణికులను జమ్ముకు చేర్చింది. 

కాగా, ఫ్లైట్ ఇలా కరెంట్ పోల్ ను ఢీకొట్టడం దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి జమ్ము వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ 160ను ప్యాసింజర్ టెర్మినల్ నుంచి రన్ వేపైకి వెనక్కి తీసుకొస్తుండగా  కుడి వైపు రెక్క, కరెంట్ స్తంభానికి తగిలిందని చెప్పారు. ఎందువల్ల ఈ ఘటన జరిగిందన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

రూ.500 కోట్ల క్లబ్లో RRR 

నేటి నుంచి యాదాద్రి కొత్త ఆలయంలో దర్శనాలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు