కరోనా ఎఫెక్ట్ : ఢిల్లీ నుంచి ముంబైకి విమానాలు,రైళ్లు బంద్

కరోనా ఎఫెక్ట్ : ఢిల్లీ నుంచి ముంబైకి విమానాలు,రైళ్లు బంద్

దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో రాకపోకలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చే విమానాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపివేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అక్టోబర్ 28 నుంచి ఢిల్లీలో కరోనా కేసులు పెరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలు చేపట్టింది.