కేసు విత్ డ్రా చేసుకోలేదని.. బాలికపై యాసిడ్ పోసి.. తానూ తాగాడు

కేసు విత్ డ్రా చేసుకోలేదని.. బాలికపై యాసిడ్ పోసి.. తానూ తాగాడు

సెంట్రల్ ఢిల్లీలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కేసును విత్ డ్రా చేసుకోలేదకి ఆనంద్ పర్బత్ ప్రాంతంలో బాధితురాలి మైనర్ కుమార్తెపై అత్యాచార నిందితుడు యాసిడ్ పోశాడు. డిసెంబర్ 7న జరిగిన ఈ ఘటనలో.. నిందితుడు అదే సీసాలోని యాసిడ్‌ను తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

17 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల వ్యక్తి యాసిడ్ పోసిన ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడు ఇప్పటికే అత్యాచారం కేసులో విచారణలో ఉండగా.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్టు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి, ప్రేమ్ సింగ్ అనే వ్యక్తిని, అమ్మాయిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలిక పోలీసులకు తన తల్లి ప్రేమ్ సింగ్‌పై ఇప్పటికే అత్యాచారం కేసు నమోదు చేసిందని, అతను తన ఇంట్లో వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెయిల్‌పై వచ్చాడని చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

చిన్నపాటి కాలిన గాయాలతో బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పోలీసులు చెప్పారు. గురువారం ఉదయం 7.30 గంటలకు ప్రేమ్ సింగ్ అత్యాచారం కేసును తన తల్లి ఉపసంహరించుకోవాలని బాలికను బెదిరించాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ప్రేమ్ సింగ్ ఆమెపై యాసిడ్ పోసి తానూ తాగాడని, చికిత్స పొందుతూ అతడు మరణించాడని పోలీసులు తెలిపారు.