ఢిల్లీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఢిల్లీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న 4,044 కేసులు నమోదుకాగా.. ఈ రోజు 60,532 మందికి టెస్టులు నిర్వహించగా కొత్తగా 4,483 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.గత 24 గంటల్లో 8,807 మంది మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ కొవిడ్ కారణంగా మరో 28 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 7.41శాతంగా ఉండగా.. 24,800 యాక్టివ్ కేసులు ఉన్నాయి.