ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
మొత్తం పోస్టులు: 714.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి (సంబంధిత విభాగం ప్రకారం) మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 17.
అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.100.
లాస్ట్ డేట్: జనవరి 15.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్టుతోపాటు పోస్టులను అనుసరించి స్కిల్ టెస్ట్/ ఎండ్యురెన్స్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్
ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
కనీస అర్హత మార్కులు: జనరల్/ ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ (ఢిల్లీ) 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ 30 శాతం, మాజీ సైనికులకు 5 శాతం సడలింపు ఉంటుంది.
పూర్తి వివరాలకు dsssbonline.nic.in వెబ్సైట్ను సందర్శించండి.

